టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా ఈ సినిమాని ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తుండగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇందులో విలన్ గా నటిస్తున్నట్లు టాక్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బన్నీ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకడు సుకుమార్ తీస్తున్నట్లు టాక్.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో ట్యూన్స్ ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విషయమై ప్రస్తుతం ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం గతంలో తాను చేసిన ప్రయోగాల మాదిరిగా కాకుండా కొంత సేఫ్ జోన్ లో ఈ సినిమాని తెస్తున్నాడట దర్శకుడు సుకుమార్.

ఇటీవల వచ్చిన రంగస్థలం మాదిరిగా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రతి ప్రేక్షకుడికి అర్ధం అయ్యేలా పక్కాగా స్క్రిప్ట్ రాసుకున్న సుకుమార్ ఇందులో పలు కమర్షియల్ అంశాలు కూడా జోడిస్తున్నాడట. మొత్తంగా చూసుకున్నట్లైతే ఈ సినిమా ద్వారా సుకుమార్ మరొక హిట్ కొట్టేలా ఉన్నారని అంటున్నారు. మరోవైపు ఇటీవల అలవైకుంఠపురములో మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో కూడా మరొక సక్సెస్ కొడితే ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: