అతి త్వరలో రెండవ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు మహేష్ బాబు. ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం మూవీ తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నారు. కాగా ఈ రెండు సినిమాలు ఇప్పటికే నలభై శాతానికి పైగా షూట్ జరుపుకున్నాయి. వీటిలో హరిహర వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండగా అయ్యప్పనుం కోషియం రీమేక్ మార్చి లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనపడుతోంది. ఈ సినిమాల తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో పవర్ స్టార్ ఒక మూవీ చేయనున విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట అలానే హరీష్ దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కోరుతూ కొన్నాళ్ల క్రితం నుండి పలువురు మహేష్, పవన్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగాఈ విషయమై ఇటీవల స్పందించారు రెండు సినిమాల నిర్మాతలు. తాము కొన్నాళ్లుగా అభిమానుల ఎగ్జైట్మెంట్ గమనించాం అని, అయితే సినిమాల షూటింగ్స్ త్వరలో ప్రారంభం అయిన తరువాత సరైన టైం లో పక్కాగా అప్ డేట్స్ రిలీజ్ చేస్తాం అంటూ వారు వెల్లడించారు. ఇక ఈ విషయమై పలువురు మహేష్, పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోల సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ రోజులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ... !!