నందమూరి
బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ చిత్రం షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.
దసరా కి కానీ
దీపావళి కి కానీ ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ
సినిమా తర్వాత
బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ
మాస్ మసాలా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి రౌడీయిజం అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రం బృందం అని సోషల్ మీడియాలో వార్తలు దాన్ని కొట్టిపారేసింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి
మూవీ మేకర్స్.
ఇటీవలే ప్రచారం అవుతున్న ఈ
సినిమా టైటిల్ పై స్పందిస్తూ ఇది తమ
సినిమా టైటిల్ కానేకాదని అందరికీ స్పష్టతనిచ్చింది. అయితే ఈ టైటిల్ బాగానే ఉంది కదా ఎందుకు పెట్టుకోకూడదు అని అభిమానులు సలహా ఇస్తున్నారు. మరోవైపు కథకు ఈ టైటిల్ యాప్ట్ కావట్లేదని వారు ఈ టైటిల్ ను పెట్టలేదు అని చెబుతున్నారు. దీంతో
బాలయ్య అభిమానులు
బాలయ్య కోసం ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ ను తీసుకు వస్తారో అని ఎదురు ఎదురు చూడసాగారు. అయితే ఈ టైటిల్ ని ఫిక్స్ చేయమని ఇంకొంత మంది కోరుతున్నారు.