యువ నటుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తొలిసారిగా పిల్ల నువ్వు లేని జీవితం మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ మూవీ మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తరువాత హరీష్ శంకర్ తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఆపైన అనిల్ రావిపూడి తీసిన సుప్రీం వంటి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ సినిమాలతో హీరోగా టాలీవుడ్ ప్రేక్షకాభిమానుల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నారు సాయి ధరమ్ తేజ్.

ఇక ఇటీవల మారుతీ తో ఆయన చేసిన ప్రతిరోజు పండగే సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది. కాగా ప్రస్తుతం ఆయన దేవా కట్టా దర్శకత్వంలో చేస్తున్న సినిమా రిపబ్లిక్. మంచి యాక్షన్ తో కూడిన పొలిటికల్, సోషల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నిన్న యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కొద్దిరోజుల క్రితం యాక్సిడెంట్ కి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మెల్లగా కోలుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ఆయన ఆరోగ్యం చాలా వరకు కుదుట పడగా త్వరలో ఆయన మళ్ళి తన షూటింగ్స్ చేసుకోవచ్చని డాక్టర్లు తెలిపినట్లు సమాచారం.

ఇక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఎంతో గ్రాండ్ గా జరుగనున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నట్లు కొద్దిసేపటి క్రితం రిపబ్లిక్ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తన మేనల్లుడి కోసం పవర్ స్టార్ ఈ వేడుక కి వస్తుండడంతో ఆ మూవీ యూనిట్ తో పాటు మెగా ఫ్యాన్స్ లో కూడా మంచి సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ రిపబ్లిక్ సినిమాని యూనిట్ అంతా కూడా ఎంతో కష్టపడి కరోనా సమయంలో రిస్క్ చేసి మరీ తెరకెక్కించాం అని, తప్పకుండా అక్టోబర్ 1 న విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని తాము అందరం పడిన కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: