నిజానికి నటి కోయినా మిత్రా ముఖానికి చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే ఆమె చేయించుకున్న శస్త్రచికిత్స విఫలమైందని మీడియాలో సీరియల్గా నెగెటివ్ వార్తలు వచ్చాయి. కోయినాకు సర్జరీ వికటించిందని ప్రచారం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో తెలిసిన చాలామంది.. ఎందుకైనా మంచిదని కోయినాకు దూరంగా ఉన్నారట. ఇది కోయినాను మానసికంగా తీవ్రంగా వేధించిందని, మూడేళ్లపాటు ఈ చిత్రవధ కొనసాగిందని ఆమె తెలిపారు. ఇదంతా మీడియా నిర్వాకం వల్లేనని కూడా కోయినా రుసరుసలాడింది.
వాస్తవానికి కోయినా మిత్ర చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్యూర్ అవలేదు. అయినా తాను చేయించుకున్న శస్త్రచికిత్సపై మీడియాలో నెగటివ్ న్యూస్ రావడం.. కోయినాను కష్టాలపాలు చేసిందట. తాను మూడేళ్ల పాటు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యానని, తన ప్రొఫెషనల్పైనా ఈ ప్రభావం పడిందని కోయినా మిత్రా వాపోయింది. ఇక ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడాన్ని కొందరు తప్పుబట్టినా.. వాటిన్నింటినీ తానేమీ పెద్దగా పట్టించుకోలేదని ఆమె తేల్చిచెప్పింది.
బాలీవుడ్లో సాకీ గర్ల్గా పేరు తెచ్చుకున్న నటి కోయెనా మిత్రా చాలా కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంది. సంజయ్ దత్, అనిల్ కపూర్ నటించిన 'ముసాఫిర్'లో ఒక పాట కోసం కోయినా మిత్రా వార్తల్లో నిలిచింది. 2004లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పాడిన 'సాకీ-సాకీ' పెద్ద హిట్ అయింది. పలు బాలీవుడ్ చిత్రాలలో నటించిన కోయినా.. 2019లో బిగ్బాస్లో కనిపించింది. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న కోయినా.. మూడేళ్లపాటు చిత్రవధ అనుభవించానని చెప్పుకొచ్చింది. ఇదండీ కోయినా మిత్రాకు ఎదురైన కష్టం. మరి ఈ బాధ నుండి కోయినా కోలుకుని మళ్లీ నటిగా బిజీ కావాలని ఆశిద్దాం.