టాలీవుడ్ లో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలనే తీసుకుంటున్నారు మన హీరోలు. దీంతో ఇప్పుడు సరికొత్త కాంబినేషన్లు చాలా పుట్టుకొస్తున్నాయి.. స్టార్ హీరోల సినిమాలలో క్రేజీ హీరోలు, హీరోయిన్లు కూడా కలిసి నటిస్తూ ఉండడంతో ఇక ఆ సినిమాలు ఇండస్ట్రీలో పెద్ద పాపులర్ గా మారుతూ ఉంటాయి. ఇక అంతే కాకుండా స్టార్ హీరోలకు సైతం.. హీరోలు విలన్లుగా నటించడానికి చాలా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు తెరకెక్కించడంలో ముందు వరుసలో ఉన్నది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు..

ప్రస్తుతం ఆచార్య, లూసీఫర్ ,గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నారని చెప్పవచ్చు.. అంతేకాకుండా గాడ్ ఫాదర్ సినిమాలో హీరో సత్యదేవ్ విలన్గా నటించబోతున్నట్లు సమాచారం. ఇక మరొక సినిమాలో రవితేజ ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం అడుగుతున్నట్లు గా సమాచారం. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో రానాతో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక మరొకవైపు బాలకృష్ణ ఈ సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా పుట్టుకొచ్చిన వార్త ఏమిటంటే హీరో నాని కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

అసలు విషయంలోకి వస్తే.. మహేష్ బాబు రాజమౌళి మూవీపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ గా మారుతుంది.. అదేమిటంటే ఇందులో విలన్గా హీరో గోపీచంద్ నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు గోపీచంద్.. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు సినిమాలో విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త బాగా చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా వీరిద్దరూ కలిసి నిజం సినిమాలో నటించారు. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: