కేన్స్ లో ఈ ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కరోనా తర్వాత ఈ ఏడాది ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు సాగుతున్నాయి. కేన్స్ వేదికపై ఎంతో మంది భారతీయ నటీనటుల హవా మరొకసారి కనిపిస్తోందని చెప్పవచ్చు.. ఎందరు ఉన్నా కూడా దీపిక పడుకొని ఉంటే ఎవరైనా ఆమె ముందు తక్కువేనని చెప్పవచ్చు. పలు రకాల డిజైనర్ దుస్తుల లో ఈ వేదికపై మెరిసింది. కేన్స్ 2022 లో రూ.3.8 కోట్ల విలువైన ఒక తెల్లటి బంగార హారాన్ని ధరించింది.

దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత జ్యూరీ మెంబర్ షిప్ గా ఈమె ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యింది. మొదటి భారతీయ నటిగా విద్యాబాలన్ చివరి సారిగా  2013లో ప్రాతినిధ్యం వహించింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు దీపికా పడుకొనే కి ఆ స్థానం దక్కింది అని చెప్పవచ్చు. ఇక ఈ ఈవెంట్ లో ప్రతి భాగాన్ని చూడడం అక్కడ గౌరవనీయమైన స్థానాలు అందుకోవడం తోపాటు.. అక్కడ ఫోటో కూడా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక అక్కడికి ఎంతమంది వచ్చిన వారందరు లో దీపిక పడుకొనే చాలా స్పెషల్ గా కనిపించింది.ఇక దీపికా పడుకొనే విషయానికి వస్తే ఒక నలుపు , బంగారం రంగులో మెరుస్తున్న చీర తో తన అందాన్ని చూపిస్తోంది. ఇక దీపికా పడుకొనే వస్త్రధారణ తో పాటుగా నెక్లెస్ కూడా బాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.18 k తెల్ల బంగారం తో ఆ నెక్లెస్ ను చేయించారు. ఒక ప్రకటనలు కేన్స్ దీపికా పడుకొనే గురించి ఇలా తెలియజేయడం జరిగింది. భారతీయ నటి నిర్మాత పరోపకారి వ్యాపారవేత్త దీపికా పడుకొనే తన దేశంలో ఒక బడా స్టార్ అని తెలియజేశారు ఆమె ఇప్పటికీ 30కి పైగా చలనచిత్రాలలో నటించింది అని తెలిపారు. వివాహమైన కూడా తన క్రేజ్ తగ్గలేదు అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: