ప్రస్థుతం మీడియం రేంజ్ హీరోలలో నాగచైతన్య స్పీడ్ మామూలుగా లేదు. వరసపెట్టి సినిమాలు చేస్తూ మీడియం రేంజ్ హీరోలలో టాప్ రేంజ్ కి వెళ్ళాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. మాస్ హీరోగా మారాలని చైతూ ఆరాట పడుతున్నప్పటికీ మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం అతడు పొందలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక మాస్ మూవీ చేయాలని నాగచైతన్య చేసిన ప్రయత్నాలకు ఊహించని విధంగా రామ్ నుండి షాక్ వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వార్తల హడావిడి చేస్తున్నాయి.


క్రియేటివ్ దర్శకుడుగా పేరు గాంచిన గౌతమ్ మీనన్ ఎప్పటి నుండో తెలుగులో తన మార్కెట్ పెంచుకోవాలని గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో నాని నాగచైతన్యలతో తీసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఇంకా అతడికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పై ఆశక్తి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో గౌతమ్ మీనన్ తమిళంలో శిoభూ తో తీస్తున్న ఒక యాక్షన్ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి మొదట్లో అనుకున్న చైతూను కాకుండా రామ్ ను ఎంపిక చేసాడు అని వస్తున్న వార్తలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.


వాస్తవానికి గౌతమ్ మీనన్ నాగచైతన్యతో తాను తీయాలి అనుకున్న యాక్షన్ మూవీ స్క్రిప్ట్ గురించి ఇప్పటికే పలుసార్లు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈప్రాజెక్ట్ లోకి ముందుగా అనుకున్న చైతన్య కాకుండా ఇప్పుడు హీరో రామ్ ఎందుకు వచ్చి చేరాడో ఇండస్ట్రీ వర్గాలకు కూడ తెలియని అంశంగా మారింది. చైతన్య తెలుగు సినిమాలలో నటిస్తూ తమిళ సినిమా రంగం పై కూడ ఆశక్తి కనపరుస్తున్నాడు. లేటెస్ట్ గా వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మాణం జరుపుకోబోతున్న మూవీకి ఓకె చేసాడు.


దీనితో ఈమూవీ కోసం చైతన్య గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టాడా అన్న సందేహాలు వస్తున్నాయి. హీరో రామ్ ఈనెల 14వ తారీఖున విడుదలకాబోతున్న ‘వారియర్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాణం జరుపుకున్న ఈమూవీని తమిళ భాషలలో కూడ విడుదలచేస్తున్నారు. మరొకవైపు బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న మూవీ కూడ తమిళ భాషలో విడుదల కాబోతోంది. దీనితో తమిళ మూవీ మార్కెట్ పై కన్నేసిన చైతన్య రామ్ ల మధ్య పోటీ గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: