ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ తదితరులు సైతం వైసీపీ నిర్ణయంపై స్పందించడం జరిగింది. తాజాగా నందమూరి బాలకృష్ణ కుమారుడు అయిన బాలకృష్ణ వైసిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తాజాగా ఫేస్ బుక్ లో వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మార్చేయటానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు ఒక సంస్కృతి ఒక నాగరికత అంటూ తెలియజేశారు. తండ్రేమో ఎయిర్పోర్ట్ పేరు మార్చాడు కొడుకేమో యూనివర్సిటీ పేరు మార్చారు అని తెలియజేశారు.
మిమ్మల్ని మార్చటానికి ప్రజలు ఉన్నారు పంచభూతాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి.. ఇక ఎంతోమంది కూడా ఆ మహానీయుడు పెట్టిన బిక్షతోనే బతుకుతున్న నేతలు ఉన్నారు పీతలు ఉన్నారని తెలియజేశారు బాలకృష్ణ. మరి ఇంత వ్యతిరేకతలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్లోని వైసిపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందేమో అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలు విషయానికి వస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్లు శృతిహాసన్ నటిస్తోంది. చివరిగా అఖండ సినిమాతో బాలకృష్ణ ఘనవిజయాన్ని అందుకున్నారు ఇక అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు.