తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అడవి శేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరిమూవీ లో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్ నానిమూవీ ని నిర్మించాడు. డిసెంబర్ 2 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ టీజర్ , ట్రైలర్  మరియు ఒక పాటను కూడా విడుదల చేసింది. వీటన్నింటికీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిమూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అడవి శేషు మాట్లాడుతూ  కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంటే బాగుంది అని ... బాగోలేకపోతే బాగోలేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి... కానీ సినిమాలో కిల్లర్ ఎవరు అనేది మాత్రం చెప్పకండి అని అడవి శేషు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇల్ ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: