ఇప్పటికే సైన్ చేసిన సినిమాలకు సంబంధించిన షూటింగ్లలో శరవేగంగా పాల్గొంటున్న ప్రభాస్ ఇక కొత్త కథలను కూడా వింటున్నాడు. ఇక ఇలా తన దగ్గరికి వచ్చిన కొత్త స్టోరీ ఏదైనా నచ్చింది అంటే చాలు ఇక ఆదర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఇప్పుడు వరకు ఎంతో మంది దర్శకులను లైన్లో పెట్టేసాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ మరో మాస్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ తెర మీదికి వచ్చింది.
ఆదర్శకుడు ఎవరో కాదు క్రాక్ సినిమాతో మళ్ళీ మునుపటి వైభవాన్ని అందుకొని వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్బస్టర్ ను ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని. ఇక గోపీచంద్ చెప్పిన కథ ప్రభాస్కు నచ్చిందట. దీంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు తెలుస్తోంది. వీర సింహారెడ్డి హిట్ తర్వాత తదుపరి సినిమా కోసం పలువురు హీరోలతో చర్చలు జరుగుతున్నాయని.. ప్రభాస్ తో కూడా ఒక స్టోరీ వినిపిస్తున్నానని చెప్పకు వచ్చాడు గోపీచంద్ మలినేని. అయితే ప్రభాస్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని తెలిపాడు. ఒకవేళ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాదాపు ఆరేళ్లపాటు వేచి చూశాక అప్పుడు సినిమా తరకెక్కించేందుకు అవకాశం వస్తుంది అన్న విషయం తెలిసిందే.