కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన కాంతార సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ముందుగా కన్నడ భాషలో విడుదలయ్యింది. అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. ఇక విడుదలైన అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ బ్యూటీ పేరు సప్తమి గౌడ. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే కన్నడలో సప్తమి గౌడ పాప్కార్న్ మంకీ టైగర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమాతో భారీ క్రేజ్ కూడా సంపాదించుకుంది. దాని తర్వాత ఈమెకి కాంతారా సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దొరికింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సప్తమి ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మకి తెలుగులో నటించే అవకాశం దక్కినట్లు గా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది. కాంతారా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె కి ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. కానీ ఈమె మాత్రం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.  'ది వాక్సిన్ వార్' ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయమైన సప్తమి ఇప్పుడు తెలుగులో అడుగు పెట్టనుంది. సప్తమి గౌడ ఇటీవల మాట్లాడుతూ.. తెలుగు లో ననటిస్తున్నాను అని తెలిపింది. నితిన్‌ సినిమా లో నటిస్తున్నాను. షూటింగ్ కూడా మొదలైంది. నేను వెళ్లి సెట్‌లో జాయిన్ అవ్వాలి' అని సప్తమి గౌడ తెలిపింది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: