టాలీవుడ్ యువ నటుడు సుహాస్ కొంత కాలం క్రితం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర జరుపుకున్న ప్రి రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది.

అలా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హీట్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆలరించింది. ఇలా థియేటర్ మరియు ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో ఫుల్ గా సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ఈ ఛానల్ వారు ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయగా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ఈ మూవీ కి 5.16 టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఇకపోతే ఈ సినిమాకు డీసెంట్ టి ఆర్ పి రేటింగ్ మొదటి సారి ప్రసారం అయినప్పుడు దక్కింది అని చెప్పవచ్చు. ఇకపోతే అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని అందుకున్న శూహస్ కొన్ని రోజుల క్రితమే ప్రసన్న వదనం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకుల నుండి మంచి టాక్ ను తెచ్చుకొని విజయవంతంగా థియేటర్ లలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: