
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు .. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఖలేజా. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు టీవీలో వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో అందరికీ తెలిసింది. బుల్లితెరపై ఎక్కువసార్లు మంచి టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా ఖలేజా రికార్డుల్లోకి ఎక్కింది. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఖలేజా ను ఇప్పటికే ఎన్నో సార్లు బుల్లి తెర మీద చూసేసినా కూడా ఇప్పుడు రీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా బుక్ మై షో లో గంటకు ఏకంగా 14 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి అంటే ఈ సినిమాపై ఎలాంటి బజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు - అనుష్క జంటగా సింగనమల రమేష్ బాబు - శ్రీ కళ్యాణ్ తర్కెక్కించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు కెరీర్ లో ప్లాప్ అయినా కూడా ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సినిమాగా ఖలేజా రికార్డుల్లోకి ఎక్కింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు