
ఈ మొత్తం వ్యవహారం వెనుక నైజీరియన్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన విశాల్ బ్రహ్మను డబ్బు ప్రలోభాలకు గురిచేసి డ్రగ్స్ రవాణాకు ఉపయోగించారని సమాచారం. నైజీరియా ముఠా అన్ని ఖర్చులు భరిస్తూ అతడిని కాంబోడియా ట్రిప్కు తీసుకెళ్లింది. తిరిగి భారత్కి వచ్చే సమయంలో సూట్కేస్ అప్పగించి, దానిని సురక్షితంగా డెలివరీ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని మాటిచ్చినట్టు తెలుస్తోంది. రెండు వారాల క్రితం ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లిన విశాల్, అక్కడి నుంచి సింగపూర్ మీదుగా చెన్నైకి చేరుకున్నాడు. ఆపై రైలు ద్వారా ఢిల్లీ చేరుకోవాల్సిన ప్లాన్ రూపొందించారు. కానీ అనూహ్యంగా చెన్నై విమానాశ్రయంలోనే అధికారులు రంగంలోకి దిగి ఆ ముఠా స్కెచ్ను చెడగొట్టేశారు.
విశాల్ బ్రహ్మ ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ప్రస్తుతం అతనికి సినిమాల ఆఫర్లు అంతగా లేవు. కెరీర్ క్షీణించడంతో ఆర్థిక ఇబ్బందులు పెరగటం, చివరికి ఇలాంటి ప్రమాదకర మార్గాల్లో అడుగుపెట్టటానికి కారణమయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన బాలీవుడ్పై మరోసారి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పలువురు నటులు, క్రికెటర్లు డ్రగ్స్ వ్యవహారాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్తో ఆ జాబితాలో ఇంకో పేరు చేరింది. అధికారులు మాత్రం దీనిని పెద్ద సిండికేట్గా భావించి.. మరిన్ని అనుబంధ నెట్వర్క్లను బట్టబయలు చేయడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.