మెగాస్టార్ చిరంజీవి – ఈ పేరు సినిమా పరిశ్రమలో ఓ బలమైన సింబల్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి, తన హార్డ్ వర్క్‌తో అగ్రతారగా ఎదిగిన చిరుతో నటించాలని ప్రతీ నటీనటికి కోరికే. ఇక అలాంటి అవకాశం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కి ఫస్ట్ మూవీతోనే రావడం, కానీ అది మిస్‌ అవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉందంటూ ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఏమాయ చేశావే – చిరుతో కలిసే మలుపు? ... సమంత కెరీర్‌ను మార్చేసిన సినిమా ‘ఏ మాయ చేశావే’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జెస్సీ పాత్ర ద్వారా సమంతను టాలీవుడ్‌లో నే భారీ క్రేజ్‌గా మార్చింది.


తాజాగా ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంటుండగా, దర్శకుడు గౌతమ్ మీనన్ చేసిన ఒక కామెంట్ అందరిలో ఆసక్తిని రేపుతోంది .  ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ – "మొదటగా ఈ సినిమా మహేష్ బాబు తో ప్లాన్ చేశాం. అలాగే క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ పెళ్లి దగ్గరకు వెళ్లే సీన్ కి గెస్ట్ పాత్రలో చిరంజీవిని తీసుకోవాలని అనుకున్నాం. హీరో హెలికాప్టర్ లో వస్తాడు. ఆ సీన్‌లో చిరు మానవతా స్పూర్తి తో వారిని కలిపే ప్రయత్నం చేస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల చిరు ఆ పాత్ర చేయలేదు.  సమంత ఫ్యాన్స్ కు అసలైన పండ‌గే!.. ఈ ఇంట్రెస్టింగ్ సమాచారం నెట్టింట వైరల్ కావడంతో, సమంత అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.


"ఒకవేళ చిరంజీవి ఆ పాత్ర చేసి ఉంటే ... సమంతకి తొలి సినిమా నుంచే మెగాస్టార్‌తో స్క్రీన్‌షేర్ చేసే ఛాన్స్ దక్కేది!" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే గ‌తంలో ఏమి జరిగిందో అదే నిజం. చిరు ఆ పాత్ర చేయకపోయినా, సమంత ఈ సినిమాతోనే అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్ కానుండటంతో మళ్లీ జెస్సీ మాయలో అభిమానులు మునిగిపోనున్నారు! సినిమా చరిత్రలో ఎన్నో మిస్‌డ్ మిరాకిల్స్ ఉన్నాయ్ ... వాటిలో ఒకటి చిరు – సమంత కలయిక. కానీ అదెప్పుడైనా జరిగితే మాత్రం అదో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ కావడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: