నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక హైప్ ఉంటుంది. ఈ జోడీ గతంలో చేసిన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, బాలయ్య కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న సీక్వెల్ అఖండ 2 - తాండవం. ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాకుండా సినీ వర్గాలూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ముఖ్యంగా సీజీ, విఎఫ్‌ఎక్స్ పనులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. అఖండలో ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిన నేపథ్యంలో, సీక్వెల్‌లో దానిని మరింత గ్రాండ్‌గా చూపించేందుకు బృందం కృషి చేస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది.


ఈ పాత్రలో టాలీవుడ్‌కే చెందిన‌ ఓ యంగ్ హీరో కనిపించనున్నారని, క్లైమాక్స్ సీక్వెన్స్‌లో బాలయ్యతో కలిసి కీలక యాక్షన్ ఎపిసోడ్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఈ అంశం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం కలిగిస్తోంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, సంయుక్త ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని టాక్. ఇక థమన్ అందిస్తున్న సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ట్రెండ్ సృష్టించి, అంచనాలను రెట్టింపు చేసింది.


అఖండ 2 - తాండవం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు సినిమా యూనిట్ స్పష్టంచేసింది. బాలయ్య స్టైల్, బోయపాటి మాస్ మేకింగ్, థమన్ మ్యూజిక్ - ఈ కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే మ‌రో మ‌ర‌పురాని సినిమాగా నిలుస్తుంద‌న్న ఆశాభావం అంద‌రిలోనూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: