రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

తెలంగాణలోని కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. మిగిలిన జిల్లాల్లో సైతం మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్ప పీడన ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడటంతో, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. పొలాల్లో నీరు నిలవడంతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల  వల్ల రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి  మారితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నైరుతి తిరోగమనంతో ఇకపై వర్షాలు కురిసే అవకాశాలు తగ్గనున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు






మరింత సమాచారం తెలుసుకోండి: