రెబల్ స్టార్ ప్రభాస్ యూఎస్ఏ లో హ్యాట్రిక్ సాధించి తెలుగు ఇండస్ట్రీలో ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే ..  యూఎస్ఏలో వరుసగా మూడో సారి 3మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాడు ప్రభాస్.  ఇంతకుముందు ప్రభాస్ నటించిన బాహుబలి  6మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టగా  బాహుబలి 2 అంతకు మూడు రేట్లు రాబట్టింది.  తాజాగా సాహో తో ప్రభాస్ మళ్ళీ 3మిలియన్ల మార్క్ ను చేరుకున్నాడు. కాగా గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ,రంగస్ధలంతో మూడు మిలియన్ల క్లబ్ లో చేరగా  సూపర్ స్టార్ మహేష్ బాబు, భరత్ అనే నేను తో ఈఫీట్ సాదించాడు. మరి ఇప్పుడు సైరా తో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ క్లబ్ లో చేరతాడో చూడాలి. 



ఇక  బాహుబలి , బాహుబలి 2 తో  ఓవర్సీస్ లో  బయ్యర్లకు భారీ లాభాలు తీసుకరాగ .. సాహో మాత్రం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.  ఈచిత్రం 3మిలియన్ల మార్క్ చేరుకుంది కానీ  ఓవర్సీస్ లో దాదాపు 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో  అక్కడ మరో మూడు మిలియన్  డాలర్ల వసూళ్లను రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ కాలేదు.  దాదాపు అక్కడ సాహో  రన్ తుది దశకు చేరుకున్నట్లే . దాంతో అక్కడి బయ్యర్లకు  భారీ నష్టాన్ని మిగిల్చనుంది ఈచిత్రం. 





ఇక సాహో  హిందీ లో 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకోగా  మిగితా అన్ని భాషల్లో డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది.  తెలుగులో అయితే ఏకంగా 40కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.  రన్ రాజా రన్  ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని  భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్  నిర్మించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: