మనిషికి జిజ్ఞాస ఎక్కువ. ఆదిమ కాలం నుంచి విశ్వ రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. టెక్నాలజీ పెరిగినా మనిషిలో జిజ్ఞాస తగ్గలేదు. విశ్వంలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి టెలిస్కోపులను తయారు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతిపెద్ద టెలిస్కోపును నిర్మించారు. ఇంత వరకు విశ్వ రహస్యాలు అందిస్తూ వస్తున్న ‘హబుల్ టెలిస్కోపు’నకు ఇది వారసురాలిగా.. జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం చేయనున్నారు. ఈ ప్రయోగం ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఈ టెలిస్కోపు నిర్మాణం.. ప్రయోగంపై పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.   


కెనడా స్పెస్ ఏజెన్సీ, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తాధ్వర్యంలో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ధి చేసింది. దాదాపు ఇరవైకి పైగా దేశాలు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యమైంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్ సాయంతో ఫ్రెంచ్ గినియాలోని గినియా స్పేస్ సెంటర్ నుంచి ఈ టెలిస్కోపును అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఈ టెలిస్కోపు నిర్మాణంలో దాదాపు 10 వేల మంది పరిశోధకులు, 4 కోట్ల పని గంటల శ్రమ దాగి ఉంది. 1996లో ఈ టెలిస్కోపు ప్రాజెక్టును ప్రారంభించారు. 2002లో దీన్ని ‘జేమ్స్ వెబ్’ పేరును పెట్టారు. 25 ఏళ్ల కృషి తర్వాత 2021లో టెలిస్కోపు సిద్ధమైంది.


ఈ టెలిస్కోపు నిర్మాణం సుదీర్ఘకాలం కొనసాగడంతో చాలా నిధులు వెచ్చించడం జరిగింది. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.50 కోట్ల డాలర్లు కాగా.. 2021లో రూ.1000 కోట్ల డాలర్ల వ్యయమైంది. అంటే దాదాపు రూ.76,000 వేల కోట్ల. ఈ నెల 22వ తేదీన పరిశోధకులు ప్రయోగం చేయనున్నారు. దీన్ని భూమి, సూర్యడి మధ్యలో ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు పంపనున్నారు. ఈ బిందువు భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఈ టెలిస్కోపు భూమిలా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. కక్ష్యలో చేరాక ఇది రోజుకు 458 గిగా బైట్లను 10 ఏళ్ల పాటు పంపనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: