గత ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడంతో ఇప్పుడు బయటకు రావడం లేదు. ఆయనకు కావాల్సింది అల్లా అధికారమే. ఇక పార్టీకి గంటా దూరంగా ఉండడంతో చంద్రబాబు కూడా పట్టించుకుంటోన్న దాఖలాలు అయితే కనపడడం లేదు. ఇక త్వరలోనే గంటా జనసేన కండువా కప్పుకుంటారని.. వచ్చే ఎన్నికల నేపథ్యంలో జనసేన - టీడీపీ పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో గంటా తనతో పాటు తన వర్గంతో కలిసి జనసేన లోకి వెళ్లి పోయి అక్కడ చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారట.
గంటా గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి చాలా మందిని తీసుకు వెళ్లి వారికి సీట్లు ఇప్పించుకున్నారు. 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చినప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు జనసేన లో కూడా అవే కండీషన్లతో చేరేందుకు సిద్ధమవుతున్నారట. విశాఖ జిల్లా తో పాటు ఉత్తరాంధ్ర లో టిక్కెట్ల ఎంపిక బాధ్యత మొత్తం తనకే వదిలి వేయాలన్నదే గంటా పెడుతోన్న కండీషన్ అట. మరి అలా చేస్తే అక్కడ అభ్యర్థులకు తాను స్వయంగా ఫండ్ రైజ్ చేస్తానని కూడా పవన్ కు హామీ ఇచ్చారని అంటున్నారు. మరి పవన్ అందుకు ఒప్పుకుంటారా ? అన్నదే చూడాలి.