ముందు వెనుకా ఆలోచించకుండా క్షణికావేశంతో చేసే పనులు కొన్ని కుటంబాల్లో విషాదాలు నింపుతాయి. ప్రత్యేకించి అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, భాగస్వామిని మోసం చేయడం వంటి అనైతిక విషయాలు చివరకూ నేరాలతోనే ముగుస్తున్నాయి. అందుకు తాజాగా మరో సంఘటన ఉదాహరణగా నిలిచింది.

 

 

మరదితో సెక్స్ సుఖం మరిగిన ఓ ఇల్లాలు.. ఆ విషయం మొగుడికి తెలిసిపోయే సరికి ఏకంగా అతడినే ముట్టుబెట్టించింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలోని హర్బర్ సింగారతోపు అనే గ్రామంలో జరిగింది. అక్కడి ఓ వ్యక్తి నాలుగుడబ్బులు సంపాదించి కుటుంబాన్ని బాగా పోషించాలన్న లక్ష్యంతో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు.

 

 

అయితే అక్కడ భర్త కష్టపడి డబ్బు సంపాదన కోసం నానా తిప్పలు పడుతుంటే.. ఇక్కడ సదరు మహిళ తన మరిదితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఏళ్ల తరబడి దుబాయ్ లోనే ఉండటంతో మరిదితో లైంగిక సుఖానికి బాగా మరిగింది. ఆ మరిది కూడా వావి వరసలు మరిచి అన్న భార్యతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు.

 

 

అయితే బావమరది పెళ్ళి కోసం ఇండియా వచ్చిన మొగుడు.. కొన్ని రోజుల్లోనే పెళ్లాం తమ్ముడికి మరిగిందని కనిపెట్టేశాడు. ఇద్దరినీ పిలిచి గట్టిగా మందలించాడు. దీంతో వాళ్లిద్దరూ కలిసి అతడిని లేపేయాలని ప్లాన్ చేసుకున్నారు. మహా ఇల్లాలు మరిది సాయంతో భర్తను హత్య చేసి పూడ్చి పెట్టింది.

 

 

అంతే కాదు.. మళ్లీ ఆమే నా భర్త కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్త కోసం ఓవైపు వెతుకుతుండగానే ఆ ఇద్దరూ దొరికిపోతామనే భయంతో కేరళ పారిపోయారు. కానీ చట్టం చేతులు పెద్దవి కదా.. ఇటీవలే ఆరేళ్ల తర్వాత పోలీసులకు దొరికిపోయారు. నేరం ఒప్పుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: