రాష్ట్రంలో కేసీఆర్ రైతులను రాజు గా చేయాలనీ చూశారు. రైతు రాజ్యం చేస్తే రాష్ట్రం సుసశ్యామలంగా ఉంటుందని అయన ఆశ.. అందుకే ఆయన మేనిఫెస్టో లో ఎక్కువగా రైతులు లాభపడే పథకాలే ఉంటాయి.. ఇక అయన తెలంగాణ లో రారాజు గా ఉండడానికి కారణం కాంగ్రెస్ ని విమర్శించడమే.. వారి పాలనలో దేశం ఎంత వెనుకపడిపోయిందో రాష్ట్రం ఎలా అయిపోయిందో ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.. ఎన్నికల సమయంలో పూర్తి గా కాంగ్రెస్ ను విలన్ గా చేసి తన పార్టీ రాష్ట్రానికి సేవ చేసిందని చెప్తూ ప్రజలను నమ్మబరుస్తారు.. నిజానికి ఇది నిజమే అయినా కేసిఆర్ కి తెలిసిన రాజకీయాలు కాంగ్రెస్ నేతలకు తెలియవని చెప్పలి..
ఇక ఇటీవలే జరిగిన ప్రాజెక్టుల్లో ప్రమాదాలు.. హైదరాబాద్ వరదలు తెలంగాణ రాష్ట్ర సమితిని డిఫెన్స్లో పడేస్తున్నాయి అని చెప్పొచ్చు.. వాటి వైఫల్యాలకు కూడ కాంగ్రెస్ ను నిందిస్తున్నారు తెరాస నాయకులు.కొన్నాళ్ల కిందట వరకూ.. టీఆర్ఎస్ ఇలా వాదనలు వినిపిస్తే.. కాస్త ఎఫెక్టివ్గా ఉండేది. కానీ ఎప్పటికప్పుడు… ప్రజలకు కష్టాలొచ్చినప్పుడల్లా.. వారి కష్టాలను తీర్చేప్రయత్నం చేయకుండా… పక్కనోళ్లపై నిందలేసి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకైనా చిరాకేస్తుంది. ఇప్పుడా పరిస్థితి వచ్చింది. ఇంత కన్నా మెరుగైన వ్యూహాన్ని టీఆర్ఎస్ నేతలు.. సిద్ధం చేసుకోవాల్సి ఉంది.