భారత దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహబంధానికి ఎంత ప్రాధాన్య ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ వివాహబంధంతో ఒక్కటౌతారు ఆడా,మగ. పెళ్లినాడు భార్యను కడదాకా వెంట ఉంటామని బాస చేస్తూ ఏడు అడుగులు వేస్తాడు భర్త  అలాంటి వివాహబంధానికి మచ్చ తెచ్చాడు ఓ కిరాతకుడు..భర్త అనే పదానికి అర్ధం లేకుండా చేశాడు ఆ దుర్మార్గుడు. కట్టుకున్న భార్యను అంగడి సరుకుగా మార్చి మరొకరికి రూ.60వేలకు విక్రయించేశాడు.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా లోని ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన దాసరా మారుతా అనే మహిళకు ఆర్మూరుకు చెందిన రాజుతో 2006లో వివాహం అయింది. పెద్దలు కుదర్చిన వివాహం బంధంతో భర్తను నమ్మి అత్తవారింటికి చేరింది భార్య. వారికి ఇద్దరు పిల్లు కూడా పుట్టారు. కానీ రాజుకు వక్రబుద్దితో మరో మహిళపై మోజుతో (అక్క కూతురు) కట్టుకున్న భార్యను ఏడాది క్రితం బాన్సువాడకు చెందిన మల్లయ్య అనే వ్యక్తికి తన భార్యను రూ. 60 వేలకు విక్రయించిన రాజు, ఆపై తన అక్క కూతురిని వివాహం చేసుకుని తన పిల్లలతో కలసి కాపురం పెట్టాడు. ఆమెకూడా అతనిని వదిలి వెళ్లిపోయింది.

ఇక రాజు పాపం పండి మారుతా సొంత గ్రామమైన జానకం పేటకు బుధవారం నాడు  రావడంతో, ఆమె తల్లిదండ్రులు పిల్లలను గుర్తు పట్టి, తమ కూతురు ఎక్కడ అని నిలదీశారు. చేసేది ఏమీ లేక రాజు జరిగిన విషయం వారికి చెప్పాడు.దీంతో మారుతా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.  వెంటనే పోలీసులు మల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారంచగా అతడు కూడా ఆమెను రూ.50 వేలకు అమ్మినట్లు తెలిపాడు... ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురైనారు. మారుత పరిస్థితి ఏ ఆడబిడ్డకు రావద్దు అంటు ఆమె తల్లిదండ్రులు పుట్టెడు దుఖ:ంలో మునిగిపోయారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు ఆ ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: