ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్న నారా లోకేష్ మరో సారి సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్ట్ నిజ రూపాన్ని బయట పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. అంతేకాక ఫ్యాక్షన్ రెడ్డి గ్యాంగులు వేటకొడవళ్లతో, కత్తులు, గొడ్డళ్ళకి పదును పెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయి అని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు లక్ష్యంగా వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు చెలరేగి పోతున్నాయని ఆయన ఆరోపణలు చేశారు.


కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసర వాయిలో టిడిపి నాయకుడు వడ్డీ నాగేశ్వర్రెడ్డి, వడ్డీ ప్రతాపరెడ్డిలను కారుతో ఢీ కొట్టిన వైసిపి ఫ్యాక్షన్ లీడర్లు వేటకొడవళ్లతో వారిని నరికి చంపడం అత్యంత దారుణమని ఆయన ఖండించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూన్నానని లోకేష్ పేర్కొన్నారు. అంతే కాక మృతుల కుటుంబాలకు, వైసిపి బాధిత కుటుంబాలకు టిడిపి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అభయం ఇచ్చారు. 


ఇక రాష్ట్రంలో జ‌గ‌న్‌ రెడ్డి, ఆయ‌న పార్టీ నేత‌ల‌ నెత్తుటి దాహానికి ఈ దారుణ‌ మ‌ర‌ణాలు సాక్ష్యం అని అన్నారు. ఫ్యాక్షన్ గ్రామాలలో శాంతి నెలకొల్పడానికి స్నేహపూర్వక వాతావరణం కల్పించడానికి తెలుగుదేశం ఎప్పుడు సిద్ధమేనని లోకేష్ అన్నారు. అయితే లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ శ్రేణులు అలాగే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలు కూడా విరుచుకుపడుతున్నారు. ఎక్కడో గ్రామాల్లో పాత కక్షల నేపథ్యంలో గొడవలు జరిగితే వాటిని జగన్ కు ముడిపెట్టడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చావు సంభవించినా దానికి జగన్ కారణం అన్నట్లు టిడిపి మాట్లాడుతోందని అది సరికాదని వైసీపీ శ్రేణులు వాదిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: