ఈ పాదయాత్రలో భాగంగా రాత్రి సమయంలో బహిరంగ సభను కూడా నిర్వహించి... తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు అన్యాయం చేశారంటూ ప్రజలకు ఎత్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి తన సొంతం ఊరు అయినా కమలాపూర్ లో బహిరంగ సభ నిర్వహించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఈటెల రాజేందర్ ప్రస్తావించారు. అలాగే తెలంగాణ లో కరెంటు ఉత్పత్తి పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ బహిరంగ సభలో ఉన్న ప్రజలు ఈటెల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'టిఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు కరెంటు ఇవ్వడం లేదని...24 గంటల కరెంటు ఉంటుందని... ఈటెల ప్రసంగానికి అడ్డుపడ్డారు ప్రజలు. దీంతో ఈటెల రాజేందర్ కూడా ప్రజల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బహిరంగ సభ రసాభాసగా సాగింది. బిజెపి కార్యకర్తలు మరియు ప్రజల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వాగ్వాదానికి సంబంధించిన ఓ వీడియో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈటెల రాజేందర్ కు సొంత నియోజకవర్గం లోని ప్రజాదరణ లేదంటూ... టిఆర్ఎస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారు.