కరోనా వైరస్ వచ్చి లాక్ డౌన్  ఏర్పడిన తర్వాత సామాన్యుడి జీవితం మొత్తం రోజురోజుకీ భారంగానే మారిపోయింది అన్న విషయం తెల్సిందే. లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత కూడా నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. సామాన్యుడికి ఇది ఎంతగానో భాగంగా మారిపోయింది. అయితే అటు దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గింది కానీ నిత్యావసరాల ధరలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు అయితే అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం గమనార్హం.


 ఇక భారీగా పెరిగి పోతున్న కూరగాయల ధరలు సామాన్యుడి జీవితాన్ని మరింత భారంగా మారుస్తున్నాయ్. అయితే మొన్నటి వరకు ఉల్లి ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు టమాట ధరలు అంతకంతకూ పెరిగి పోయాయి. దీంతో మార్కెట్ కి వెళ్లి టమాటా కొనుగోలు చేయాలి అంటేనే భయపడిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా టమాటా పంట పూర్తిగా నష్టం వాటిల్లడంతో ఇక ప్రస్తుతం మార్కెట్లో టమాటా దిగుబడి తక్కువగా ఉంది. దీంతో టమాటా కొరత కారణంగా ఇక భారీగా డిమాండ్ ఏర్పడింది.


 కొన్ని ప్రాంతాలలో కిలో టమాట ₹100 పలుకుతుంటే మరికొన్ని ప్రాంతాలలో 150 రూపాయల వరకు పలుకుతూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవలే చెన్నైలోని ఒక బిర్యాని సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. కిలో టమాటాలు ఇస్తే బిర్యానీ ఫ్రీగా ఇస్తాం అంటూ ఒక ప్రకటన పెట్టారు.  దీంతో భోజన ప్రియులు అందరూ కూడా ఎగబడి మరీ బిర్యానీ కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం.  ప్రస్తుతం చెన్నైలో కిలో టమాట ధర 150 రూపాయలకు పైగానే పలుకుతుందట.  ఇక షాప్ లో ఒక్క బిర్యాని ధర వంద రూపాయలు మాత్రమే. ఈ క్రమంలోనే ఇలాంటి ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆఫర్ తో ఈ బిర్యాని సెంటర్ కాస్తా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: