ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరాల సమయం ఉంది. ఎన్నికలకు ఎంత టైం ఉన్న కూడా అప్పుడే ఏపీలో రాజకీయ వేడి బాగా ర‌గులుతుంది. అధికార వైసీపీ సంగతి కాసేపు పక్కన పెడితే... విపక్ష టిడిపి మాత్రం మరో ఆరు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి అన్నట్టుగా ప్రజల్లో ఉంటుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా ప్రజల్లో గట్టిగా తిరుగుతున్నారు.

మరోవైపు జనసేనతో టిడిపి పొత్తు ఉంటుందన్న ప్రచారం కూడా పార్టీ నేతల మధ్య ప్రధానంగా చర్చకు వస్తుంది. 2014 ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపికి మద్దతు ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక రాజోలు సీటుతో మాత్రమే సరిపెట్టుకుంది. అయితే జనసేన వ‌ల్ల‌ టిడిపి ఏకంగా 40 స్థానాల్లో ఓడిపోయింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే తెలుగుదేశం - జనసేన నేతల మధ్య పొత్తు గురించి రెండు మూడు సార్లు చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. బిజెపి కూడా ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తుందని అంటున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే బీఎస్పీ కూడా ఈ కూటమిలో కలుస్తుందని తెలుస్తోంది. ఈ కుట్రలో ప్రధాన పార్టీగా టిడిపి ఉంటుంది. అయితే బిజెపి - జనసేన - బీఎస్పీ పార్టీలతో కలిసి పోటీ చేస్తే టీడీపీ భారీగా సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఉంది.

చాలా నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురు అయ్యే ప్రమాదం కూడా ఉంది. మూడు పార్టీలు క‌లిస్తే  టీడీపీ - 100 సీట్లు , జ‌న‌సేన - 50 , బీజేపీ - 20 , బీఎస్పీ+ఇత‌రులు - 5 సీట్ల లో పోటీ చేస్తాయ‌ని అంటున్నారు. అయితే ఇందుకు టీడీపీ మాత్రం ఒప్పు కోవ‌డం లేద‌ని.. ఇత‌రుల‌కు 20 - 25 సీట్లు మించి ఇచ్చే ప‌రిస్థితి లేదంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: