ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల పైన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ మరో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే... ఈ సంస్థ ఫిర్యాదు కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించడం.. ఫలితంగా ఈ నిర్ణయం రాజకీయంగా పెను దుమారానికి కారణమయ్యిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో తాజాగా రాజీనామా చేసిన వాలంటీర్ల పైన కూడా సంస్థ ప్రతినిది నిమ్మగడ్డ రమేష్.. ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేయడం జరిగింది.దీంతో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.పూర్తి వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతోందన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... వాలంటీర్లు రాజీనామా చేసినా కూడా ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామమోహన్‌ మిశ్రాను సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరడం జరిగింది.


ఇక ఇందులో భాగంగా... వాలంటీర్లు రాజీనామాలు చేసినా కూడా పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు చెప్పుకొచ్చారని సమాచారం తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా నిమ్మగడ్డ వదలడం లేదనే కామెంట్లు ఈ సందర్భంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇదంతా చంద్రబాబు నాయుడు తెర వెనుక ఉండి ఆడిస్తున్న డ్రామా అంటూ వైసీపీ నేతలు బాగా ఫైర్ అవుతున్నారు.మరోపక్క ప్రభుత్వ సలహాదారులపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా... ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందు వల్ల ప్రభుత్వ సలహాదారులు కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని ఆయన స్పష్టంచేశారు. ఇదే సమయంలో... జీతాలు తీసుకుంటున్నవారు ఎన్నికల సమయంలో రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదని వెల్లడించడం జరిగింది. ఏ ఉద్యోగి అయినా అలా చేస్తే విధుల నుంచి ఖచ్చితంగా సస్పెండ్‌ చేస్తారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: