తిరుమల తిరుపతి అంటే హిందువులు భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. అయితే అక్కడికి భక్తులు చాలామంది ఇతర దేశాల నుంచి మన దేశం నుంచి కూడా వెళుతూ ఉంటారు. ఇటీవలే తిరుమలలో కొన్ని విభిన్నమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో టిటిడిలో తాజాగా నలుగురు అన్యమత ఉద్యోగులపైన సస్పెండ్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని టిటిడి సమాచార శాఖ అధికారికంగా వెల్లడించింది. టీటీడీలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ B. ఎలిజర్, బర్డ్ లో నర్సుగా పని చేస్తున్న ఎస్ రోసి, అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ఎం ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీ ఉద్యోగి అయిన G.అసుంతలను టీటీడీ తాజాగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.


ఈ నలుగురు ఉద్యోగులు కూడా క్రిస్టియన్ మత సాంప్రదాయాలను అనుసరిస్తున్నారనే విషయాన్ని గుర్తించి మరి టీటీడీ సస్పెండ్ చేసింది. హిందూ ధార్మిక సంస్థలలో వీరు విధులు నిర్వహిస్తూ నియమావాళికి విరుద్ధంగా అన్యమతాన్ని అనుసరించడం నిబంధనలు ఉల్లంఘించినట్లుగా టీటీడీ భావిస్తూ వీరిని సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించింది. టీటీడీ విజిలెన్స్ విభాగంలో సమర్పించిన నివేదికలతో పాటుగా మరికొన్ని ఆధారాలను పరిశీలించి.. వీరిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ వెంటనే అమలులోకి వచ్చిందని తెలిపారు.


ఈ నలుగురు ఉద్యోగులు 2007 ముందు టీటీడీలో ఉద్యోగులుగా చేరి ఉంటే మాత్రం కచ్చితంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదట.. ఎందుకంటే 2007 ముందు టీటీడీలో హిందువులే చేరాలనే నిబంధనలు లేవని.. గతంలో ఇలాంటి ఆరోపణలతో ఒక అధికారిని సస్పెండ్ చేయగా న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ఉద్యోగుల విషయంపై ఇంకా ఏ విధమైనటువంటి స్పష్టత కనిపించలేదు. ఈ ఉద్యోగుల సస్పెన్స్ తో మిగిలిన ఉద్యోగులకు ఒక హెచ్చరిక ఉంటుందని తిరుమల భక్తులు భావిస్తున్నారు. మరి ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: