
ఇలాంటి సమయంలోనే కేసీఆర్ అప్పుడు చేసింది కవిత ఇప్పుడు చేస్తోంది. ఆనాడు కెసిఆర్ కూడా టిడిపి సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపు మాపో కొత్త పార్టీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మాకు పదవులు ముఖ్యం కాదని అప్పుడు కేసీఆర్ చేసింది.. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడుస్తోంది.
ఆనాడు కెసిఆర్ కూడా పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమంలోకి వెళ్ళగా ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవబోతోంది. ఉద్యమం నుంచి వచ్చిన మాకు మళ్లీ ఉద్యమంలోకి వెళ్లడం కొత్తేమీ కాదంటూ తెలియజేసింది. కెసిఆర్ పార్టీ పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కవిత పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎన్నికలు జరుగుతాయని.. వీటిలో జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కవిత నిలబడే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతోంది. అప్పట్లో కెసిఆర్ కి ఉప ఎన్నికలు కలిసి రాగ ఇప్పుడు అదే సెంటిమెంటుపై కవిత కూడా అప్లై చేయాలనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న కెసిఆర్ రాజీనామాల పర్వం ప్రారంభమైంది.. అలా డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యేకు, టిడిపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఆ వెంటనే సిద్ధిపేట ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.