
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంపై పూర్తి దృష్టి పెట్టడం, పార్టీని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నించడం వల్ల టీడీపీకి ఇక్కడ స్థానం దక్కడం కష్టమనే భావన బలపడుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల టిడిపి వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది.
గత ఎన్నికల్లో వర్మను పార్టీ వదిలేయడం ఆయనకు తీవ్ర నిరాశ కలిగించింది. చంద్రబాబు అప్పట్లో ఆయనకు ఎమ్మెల్సీని చేస్తానని భరోసా ఇచ్చినా, ఇప్పుడు ఆ హామీ నెరవేరలేదని ఆయన వర్గం అంటోంది. ఇక జనసేన బలపడటంతో వర్మకు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించకపోతే వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మరోవైపు చంద్రబాబు ఈ అంశంపై మౌనం పాటించడం గమనార్హం. ఆయన టిడిపి భవిష్యత్ వ్యూహంలో పిఠాపురం ప్రాధాన్యం తగ్గిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద పిఠాపురం రాజకీయాలు మరోసారి వేడెక్కేలా ఉన్నాయి. ఇక్కడ పవన్ వేస్తోన్న బలమైన అడుగులు, టిడిపి వర్మ లోపల పెరుగుతున్న అసంతృప్తి ఈ రెండు కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది.