ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో అప్పటినుంచి  నేషనల్ హైవే పనులు, అమరావతి రాజధాని అభివృద్ధి పనులు, అలాగే విమానాశ్రయ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం మెడలు  వంచి మరీ అనేక నిధులు తీసుకువస్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల కోసం మరో అద్భుతమైన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏంటయ్యా అంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్.. అయితే ఈ సంస్థను తీసుకురావడం కోసం భారత్ ఏఐ శక్తి పేరుతో  గూగుల్ ప్రతినిధులతో  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మిగతా ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రూ:87,500 కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థను  విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.  


దీనికి గూగుల్ సంస్థ ప్రతినిధులు కూడా ఓకే చెప్పారు. దీనివల్ల త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఏఐ సిటి హబ్ గా మారబోతోంది. ఇదిలా నడుస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ సంస్థ రావాలంటే తప్పకుండా కరెంటు కావాలి కానీ ఏపీలో అంత కరెంట్ ఉత్పత్తి ఉందా అని మాట్లాడుతున్నారు. నిజానికి ఏపీలో ఎంత కరెంటు ఉత్పత్తి అవుతుంది గూగుల్ సంస్థ వారికి ఎంత కరెంటు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక గిగావాట్  కెపాసిటీ కలిగిన ఏఐ డేటా సెంటర్ నడపాలి అంటే వెయ్యి మెగావాట్ ల విద్యుత్ అవసరం. ఏపీలో ప్రస్తుత విద్యుత్ కెపాసిటీ చూస్తే మాత్రం సోలార్, హైడ్రో వాటర్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ 18552.97 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది.

ఇందులో కేటగిరి ప్రకారం చూస్తే 5.8 సోలార్ విండో రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టుల ద్వారా 9,419 మెగావాట్లు ఉంది. 7655.50 మెగావాట్లు  బొగ్గుతో నడిచే థర్మల్ ప్రాజెక్టుల ద్వారా వస్తోంది. అలాగే 1672.60 మెగావాట్లు  నీళ్లతో ఉత్పత్తి అవుతుంది. 2030 నాటికి 31 వేల మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు కరెంట్ ఇవ్వడానికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇలా గూగుల్ కు కరెంట్ ఇస్తే రాష్ట్రంలో కరెంటులో ఇబ్బందులు ఎదురవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందులో ఏమాత్రం నిజం లేదని  విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: