( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. మూడు ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థుల‌తో పాటు మొత్తం 58 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి న‌వీన్ యాద‌వ్‌, బీఆర్ఎస్ నుంచి దివంగ‌త మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి మాగంటి సునీత , బీజేపీ నుంచి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన లంకాల దీప‌క్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎంత మంది పోటీలో ఉన్నా కూడా ముందు నుంచి ప్ర‌ధాన పోటీ మాత్రం బీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్యే ఉంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అనేక‌న్నా కాంగ్రెస్ నుంచి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌ధ్యే హోరాహోరీగా కొన‌సాగుతోంది.


జూబ్లిహిల్స్ లో ఐదు రౌండ్లు ముగిసే స‌రికి కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ ఏకంగా 12,650 ఓట్ల భారీ మెజార్టీతో ముందుకు దూసుకు పోతున్నారు. తొలి రౌండ్‌లో మాత్ర‌మే బీఆర్ ఎస్ గ‌ట్టి పోటీ ఇచ్చింది. తొలి రౌండ్ లో మాత్ర‌మే కాంగ్రెస్ కు కేవ‌లం 62 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. త‌ర్వాత నాలుగు రౌండ్ల లోనూ కాంగ్రెస్ దూసుకు పోయింది. పైగా ఆరు , ఏడు రౌండ్లు కాంగ్రెస్ అభ్య‌ర్ధి న‌వీన్ యాద‌వ్ సొంత డివిజ‌న్ అయిన యూస‌ఫ్ గూడ ప‌రిధి లోనివి కావ‌డంతో ఇక్క‌డ కాంగ్రెస్ కు మ‌రింత భారీ మెజార్టీ వ‌స్తుందంటున్నారు. ఓవ‌రాల్‌గా కౌంటింగ్ పూర్త‌య్యే స‌రికి మెజార్టీ 25 వేలు దాటుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: