నందమూరి బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. బాలకృష్ణ యాంకర్ గా ఏంటి అన్న వారంతా నోరు ముగించేలా చేశాడు బాలకృష్ణ. తెలుగులో ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా వేదిక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉన్నారు. ఇందులో బాలకృష్ణ మాటతీరు ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని మంచి విజయాన్ని అందించారు.


ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తో ప్రారంభించి చివరి గా మహేష్ బాబు తో పూర్తి చేశారు. ఇక అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ఎంతో మంది యువ హీరోలు ,దర్శకులు కూడా హాజరయ్యి బాలకృష్ణ తో సరదాగా ముచ్చటించడం జరిగింది. ఇక అంతే కాకుండా వారి యొక్క వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఈ కార్యక్రమానికి మంచి హైప్ వచ్చేలా చేశారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. అన్ స్టాపబుల్-2 ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి అనే టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాబోతున్న హీరోలను సైతం ఫైనలైజ్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి అతిథులుగా చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు రాబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. ఇక అందుకు సంబంధించి ఈ కార్యక్రమ పనులు కూడా చాలా శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం గురించి అధికారికంగా తెలియజేయబోతున్నట్లుగా అని కూడా టాక్ బాగా వినిపిస్తోంది. మరి ఈ రెండో సీజన్ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: