ఇప్పుడు ఎంతగానో సైన్స్ బాగా డెవలప్ అయింది. అంతే కాకుండా కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంది.ఇక ఇప్పటికీ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. మన దేశంలో ఇంకా మూఢనమ్మకాలు అనేవి చాలానే ఉన్నాయి. వీటి మీద నమ్మకంతో కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇక అంతే కాకుండా కొంత మంది నిండు ప్రాణాలు బలి ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఒక జంట చేసింది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఒక జంట కి సంతానం కలగాలని అందుకోసం నరబలి ఇవ్వాలని అని ఒక భూతవైద్యుడు చెప్పడంతో విరు పథకం మీద ఈ పని చేశారు. అసలు విషయంలోకి వెళితే.. మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో నివాసం ఉంటున్న బంటు, మమత అనే ఈ దంపతులకి 18 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇప్పటికీ వీరికి సంతానం కలగలేదని, వీరి స్నేహితుడు గిర్వార్ యాదవ్ అనే ఒక భూతవైద్యుడు ఉన్నాడు .ఈ జంట ఇ వ్యక్తిని సంప్రదించగా.. దీనికి నరబలి ఒక్కటే మార్గం అని చెప్పడంతో ఈ జంట సరే అనింది.

 బలి ఇచ్చేందుకు కావలసిన వ్యక్తి బాధ్యతను భూతవైద్యుడు నీరజ్ కు అప్పగించాడు.అందుకోసం ఒక వేశ్యను తీసుకొచ్చాడు నీరజ్ .దాంతో అమేను భూతవైద్యుడు బలి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తరువాత మృతదేహాన్ని బైక్ పై వేరొక చోటికి తరలించే క్రమంలో.. ఆ వేశ్య డెడ్ బాడీ కిందపడింది. దాంతో నిరంజన్ భయపడ్డాడు. ఇక అక్కడే ఆ వేశ్య మృతదేహాన్ని వదిలిపెట్టి పారిపోయాడు.

ఇక ఆ తరువాత మరొక వేశ్యను తీసుకువచ్చి  భూతవైద్యుడు విగ్రహం ముందు బలి ఇవ్వడం జరిగింది. ఇక మొదటి సారి బలి ఇచ్చిన వేశ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత అసలు విషయం అంతా బయట పడింది. ఇక ఆ వేశ్య మొబైల్లో ఉండేటువంటి కాంటాక్ట్ లిస్ట్ ద్వారా నీరజ్ ను సంప్రదించగా పోలీసులకు అన్ని విషయాలు తెలియజేశాడు నీరజ్. ఇక రెండవ సారి ఆ వేశ్యను ఎందుకు తీసుకు వచ్చావ్ అని అడగగా.. ఆమె మందు తాగడం వల్ల పూజ ఫలించదు అని చెప్పడంతో.. వేరొక వేశ్యను తీసుకు వచ్చాను అని తెలియజేశాడు. ఈ విషయాలు తెలుసుకొని షాకయ్యారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: