ప్రతి సంవత్సరం
అక్టోబర్ మొదటి వారంలో జరిగే నోబెల్ పురస్కారాల ప్రకటనలో భాగంగానే ఈ సంవత్సరం కూడా నిర్వాహకులు
నోబెల్ బహుమతి గ్రహీతల వివరాలు ప్రకటించారు. వీటిలో భాగంగా వైద్య రంగంలో ఈ ఏడాదికి గానూ నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. హెపటైటస్-సి వైరస్పై పరిశోధనలకు గానూ హార్వే అల్టన్, మైఖేల్ హటన్, చార్లెస్ రైట్కు సంయుక్తంగా నోబెల్ ప్రకటించారు. హార్వే అల్టన్, చార్లెస్ రైట్
అమెరికా దేశ పౌరులు కాగా.. మైఖేల్ హటన్ బ్రిటన్ దేశ పౌరుడు.
అమెరికా బెథెస్డా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హెల్త్ విభాగంలో అల్టర్.. హౌటన్ కెనడాలోని
యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టాలో.. చార్లెస్ రైస్ రాక్ఫెల్ యూనివర్సిటీలోనూ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురికి నోబెల్
ప్రైజ్ మనీ సమానంగా అందజేయనున్నారు నోబెల్ పురస్కార నిర్వాహకులు. ఇక నోబెల్ బహుమతులను తొలినాళ్లలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు బహుకరించేవారు. 1969 నుంచి అర్ధశాస్త్రంలోనూ పురస్కారం అందజేస్తున్నారు.
ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం ఆయన మరణించిన ఐదేళ్ల తర్వాత 1901లో ఈ పురస్కారాలను ప్రారంభించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి
బహుమతి బ్యాంక్ ఆఫ్
స్వీడన్ అందజేస్తోంది. ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు 10న
స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ప్రధానం చేస్తారు.
వైద్యశాస్త్రంలో నోబెల్ను స్వీడన్కు చెందిన కరోలిస్కా ఇన్స్టిట్యూట్ అందజేస్తుంది. వైద్య రంగంలోనూ
అల్ఫ్రెడ్ నోబెల్ పరిశోధనలపై ఆసక్తి ప్రదర్శించారు. కరోలినిస్కా ఇన్స్టిట్యూట్లో
స్వీడన్ వైద్యుడు జోన్స్ జోహన్స్తో కలిసి పనిచేశారు. ఇదే సమయంలో ఫ్రాన్స్లోని ప్రముఖ ల్యాబొరేటరీలో పరిశోధనలు చేశారు. అందుకే వైద్య శాస్త్రంలోనూ నోబెల్ను అందజేస్తున్నారు. ఈ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద్ ఖురోనాకు 1968లో
నోబెల్ బహుమతి లభించింది.