ఇందుకు కావలసినవి :
బియ్యం : 50 గ్రాములు
సోయాబీన్స్ పొడి : 20 గ్రాములు
పాలు : అర లీటర్ సన్నని
బాదపప్పు : 2 చెంచాలు సన్నని
జీడిపప్పు ముక్కలు : 2 చెంచాలు
చెక్కర : తీపికి సరిపడ
వెనీలా ఎసెన్స్ : 2 చుక్కలు
తయారీ చేయు విధానం:
ముందుగా పాలు కాగనివ్వాలి. బియ్యం కడిగి పాలలో వేసి ఉడికించాలి. బియ్యం ఉడుకుతున్నపుడు గరిటతో కలుపుతూ ఉండాలి. బియ్యం ఉడికిన తరువాత సోయాబీన్ పొడిన కొంచెం నీటితో కలిపి ఉడుకుతున్న అన్నంకు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
చివరగా వెనిల్లా ఎసెన్స్, బెల్లం జతచేసి దింపాలి. 1 చెంచా నేతిలో బాదం, జీడిపప్పు వేపి దీనికి జత చేయాలి. గోరువెచ్చగా అయిన తరువాత పిల్లలకు చెంచాతో కొద్దికొద్దిగా సరిపడ తినిపించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: