ఫేమస్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా.. కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2008 వ సంవత్సరంలో రూ.లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఈ కారే కావడం విశేషం. అయితే, ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో లేదు. 2018 వ సంవత్సరం నుంచి టాటా మోటార్స్ కంపెనీ ఈ కార్ తయారీని కూడా నిలిపివేసింది. ఇక ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని సమాచారం తెలుస్తోంది. నానో మార్కెట్లోకి వచ్చిన దాదాపు 14 ఏళ్ల తర్వాత టాటా కారుకు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి. టాటా కంపెనీ కారు నానో మళ్లీ వచ్చేస్తుందని.. అదికూడా ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుందని, అదికూడా ఎలక్ట్రిక్ మోడల్స్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. టాటా కంపెనీ.. ఎలక్ట్రిక్ మోడల్ టాటా నానో కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.


ఇక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతోపాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానో కార్ ను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ ప్లాన్ చేస్తోంది. టాటా మోటార్స్ డ్రీమ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అయిన టాటా నానో, అప్‌డేట్ ఫీచర్లు ఇంకా అలాగే డిజైన్‌ మార్పు మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది.2025 వ సంవత్సరం నాటికి.. మార్కెట్ లో  మొత్తం 10 రకాల ఫీచర్లతో టాటా నానోలను విడుదల చేయడమే లక్ష్యంతో కంపెనీ ముందుకెళ్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఇదే జరిగితే.. 2025 వ సంవత్సరం నాటికి భారతదేశంలో నానో మరో శకం ప్రారంభమవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇండియన్ మార్కెట్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని.. టాటా కంపెనీ ప్లాన్ లను ప్రారంబించినట్లు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: