బిహార్​లో బిజేపి-జేడీయూ పొత్తును క్రికెట్​లో సచిన్-సెహ్వాగ్ జోడీతో పోల్చారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. సచిన్-సెహ్వాగ్​లా తమది కూడా సూపర్​ హిట్ జోడీ అని అభివర్ణించారు. బిహార్​లో కూటమి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిపై ఎవరైనా చర్చించవచ్చని.. కానీ, అవినీతి విషయంలో సీఎం నితీశ్ కుమార్​ వైపు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేరని అన్నారు.


భగల్​పుర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్​నాథ్... విపక్షాలపై విరుచుకుపడ్డారు. లాంతరు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) పగిలిపోయిందని, ఇప్పుడు అది పనిచేయదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 15 ఏళ్ల ఆర్జేడీ పాలన, నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి పాలన మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. దశాబ్దాల పాటు తాగునీరు, విద్యుత్, రహదారుల లేమితో సతమతమవుతున్న బిహార్ ప్రజలకు తమ ప్రభుత్వం కనీస అవసరాలన్నింటినీ అందించిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: