17 ప్రధాన దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కాడు. చత్తీస్‌గడ్‌ ని లక్ష్యంగా చేసుకుని జరిపిన అనేక కీలకమైన ఆపరేషన్లలో టైగర్ హుంగా సుక్మా ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. హుంగా ని మావోయిస్టులు టైగర్ అనే పేరుతో పిలుచుకుంటారు. టైగర్ హోండా ను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎస్పీ సునీల్ శర్మ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. టైగర్ హుంగా నేతృత్వంలో దండకారణ్యంలో జరిగిన ప్రధాన సంఘటనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించినట్టుగా ఎస్పి తెలిపారు. ల్యాండ్ మైన్ ప్రూఫ్ ఉన్న వాహనాలను సైతం పేల్చడంలో హుంగా నేర్పరి అని తెలిపారు ఎస్పీ సునీల్ శర్మ. ఇక 2020 లో పాలోది ప్రాంతంలో జరిగిన ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహనం పేల్చివేత లో ఇతడే ప్రధాన నిందితుడు. ఈ పేలుడులో తొమ్మిది మంది జవాన్లు అక్కడికి అక్కడే కన్నుమూసారు. అంతేకాదు ఈ పేలుళ్లలో ఒక సీఆర్పీఎఫ్ కమాండర్ సైతం మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: