జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో గంజాయి సాగుకి సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్ధిక అంశం అని అన్నారు ఆయన. విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని చదువు పూర్తయిన, కుర్రాళ్ళు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు అని అన్నారు. మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది అని నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుంది అని వివరించారు. అప్పుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్తుంది అన్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు అని ఆ పని వదిలి... బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు అని వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ సీజ్ చేసినదాని కంటే, రాష్ట్రం దాటిపోతున్న సరుకు ఎక్కువగా ఉంటుంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: