పండుగ వేళ ఎవరైనా కొత్తగా కారు లేదా టూ వీలర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే మీకోసమే ఈ శుభవార్త. మీరు కొత్తగా కారు లేదా టూ వీలర్ కొంటే వెహికల్ రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అయితే ఈ ఆఫర్ అన్ని రకాల వాహనాలకు వర్తించదు. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా ఎంపిక చేసిన వాహనాలకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉంది.

ఎలక్ట్రిక్ వెహికల్స్ EV లకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు బెనిఫిట్ అనేది కేవలం ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం ఇవి కొనుగోలు చేసిన వారికి నగదు ప్రోత్సాహం కూడా అందిస్తోంది. దీని కోసం కొనుగోలుదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే వెబ్‌సైట్ ద్వారా వెహికల్ కొనొచ్చు. భారత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు అక్కడి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మేరకు కస్టమర్లకు బెనిఫిట్స్ అందిస్తోంది. ev.delhi.gov.in వెబ్‌సైట్ ద్వారా నేరుగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయవచ్చు. 100కు పైగా ఈవీ మోడళ్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపై సబ్సిడీ వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన వారికి ఢిల్లీ ప్రభుత్వం అందించే సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి చేరతాయి. ఇదంతా ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. కాగా టాటా మోటార్స్ దగ్గరి నుంచి మహీంద్రా వరకు పలు కంపెనీలు వాటి యొక్క వివిధ రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. ఏది ఏమైనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని పొల్యూషన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు విశేషమైన కృషి చేస్తున్నారు. ఢిల్లీ సీఎంలాగే మిగిలిన రాష్ట్రాల సీఎంలు కూడా త్వరగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దేేేశం మొత్తం అతి త్వరలో కాలుష్య రహిత దేశంగా రూపాంతరం చెందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: