
పవన్ తీసుకునే రెమ్మునరేషన్ ఆయన తీసేసుకున్నాడు. సో.. ఏపీలో ధరలు తగ్గినా.. పెరిగినా ఆయనపై పడే ప్రభావం లేదు. ఇక, ఐదో ఆటను నిషేధించారని చెప్పారు. ఇది కూడా ఆయనకు పెద్దగా నష్టం చూకూర్చే విషయం కాదు. అభిమానులుగా ఉన్నవారు.. నాలుగు ఆటలు వేసినా.. ఎగబడి చూస్తున్నారు. ఐదు ఆటలు ఉన్నా .. ఇదే పరిస్థితి. దీంతో ఈ విమర్శలు గాలికి పోయాయని చర్చ కు వచ్చింది. దీంతో ఇప్పుడు మరో ప్రధాన, అంత్యంత కీలకమైన విమర్శను తెరమీదికి తెచ్చారు.
అది కూడా ఒక సామాజిక వర్గానికి ముడి పెట్టేసి మాట్లాడారు. ఆ కులాన్ని తొక్కేయాలని జగన్ కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఇలా చేస్తున్నారని అన్నారు. అదేంటంటే.. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి.. కాపులను ఎదగనీయకుండా చూడాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం పాలన చేస్తోంది కాబట్టి.. ఇలా చేస్తున్నారని.. టీడీపీకి చెందిన ఒక కీలక ఎమ్మెల్యే (ఈయన కాపు కాదు) వ్యాఖ్యానించారు.
పోనీ.. ఇదే నిజం అనుకున్నా.. పుష్ప సినిమా.. హీరో.. కూడా కాపు కులస్తుడే. పవన్కు బంధువే కదా.. మరి ఆ సినిమాను తొక్కేయలేదు. అలాకాదు.. అసలు కాపులపైనే జగన్ కక్ష ఉందని అనుకుంటే.. ముగ్గురు కాపు నేతలకు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారో.. అర్ధం కాదు. ఇలా ఎలా చూసుకున్నా.. ఇప్పుడు కాపులతో భీమ్లా నాయక్ సినిమాకు ముడిపట్టి చేసిన విమర్శ ఎక్కడా పొసగడం లేదు. ఒక్క రాజకీయం తప్ప. అందుకే.. మరీ ఇది చిత్రం బ్రో అంటున్నారు నెటిజన్లు.