సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆమె పిల్లల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో సునీత పిల్లలు షాక్‌లో ఉన్నారట.  టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి గత నెల జనవరి 9న ఘనంగా జరిగింది. ఈయన ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను పెళ్లి చేసుకుంది. ఈయన డిజిటల్ మీడియాలో తోపు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉండి పాతుకుపోయాడు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీళ్లిద్దరు పెద్దలతో పాటు పిల్లల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సునీత, రామ్ వీరపనేనిల పెళ్లి పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వీరి పెళ్లి పై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్‌తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. తాజాగా సింగర్ సునీత పిల్లల విషయంలో రామ్ వీరపనేని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అది అలా ఉంటే.. సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అందులో భాగంగా ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో పాటు ఇతర విషయాలను.. వివిధ సందర్భాల్లో ఆమె దిగిన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.  తాజాగా సునీత భర్త రామ్ వీరపనేని.. సునీత పిల్లలకు తన ఆస్తిలో కొంత భాగం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడట. అంతేకాదు తన వ్యాపారంలో వారిని భాగస్వాములుగా చేయబోతున్నట్టు సమాచారం. సునీతను పెళ్లి చేసుకోవడంతో పాటు వారి పిల్లల ఆలనా పాలనా ఇకపై రామ్ వీరపనేని చూసుకోనున్నారు. అందులో భాగంగా ఆస్తిలో కొంత భాగం సునీత కూతురి, కొడుకుకు రాసినట్టు సమాచారం . ఇప్పటికే సునీత అబ్బాయికి ఓ ఫామ్ హౌస్‌ ‌తో పాటు మ్యాంగో వీడియోలో 20 శాతం వాటా ఇచ్చినట్టు సమాచారం. ఇంకోవైపు కూతురుకి కూడా మ్యాంగో వీడియోస్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తీసుకోవాలనే నిర్ణయానికి రావడంతో పాటు రెండు బంగళాలు కూడా ఆమె పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసినట్టు సమాచారం. భర్త రామ్ వీరపనేని చేసిన పనికి ఇపుడు సునీతతో పాటు పిల్లలిద్దరు షాక్‌లో ఉన్నారట. రామ్ వీరపనేని చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియడం లేదంటూ తమ సన్నిహితులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఏమైనా సింగర్ సునీత.. ఆలస్యం గానైనా మంచి మనుసున్న భర్తను పొందినదని ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: