ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. పవర్ స్టార్ తో పాటు తొలిసారిగా అయనతో కలిసి దగ్గుబాటి రానా కూడా కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఇటీవల మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రిమేక్ గా యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని మన తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అయితే దీనితో పాటు ఇప్పటికే సగానికి పైగా షూట్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో కూడా త్వరలో పాల్గొననున్నారు పవర్ స్టార్. క్రిష్ తీస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. కాగా ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పటికే హరీష్ శంకర్ తో అలానే సురేందర్ రెడ్డితో కూడా మూవీస్ లైన్ లో పెట్టిన పవన్, ఆపై త్వరలో మాస్ చిత్రాల దర్శకడు బోయపాటి శ్రీనుతో కూడా ఒక మూవీ చేయనున్నారు అనేది లేటెస్ట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్.

దాని ప్రకారం ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా తీస్తున్న బోయపాటి, త్వరలో రామ్ తో ఒక మూవీకి సిద్ధం అవుతున్నట్లు టాక్. దానితో పాటు పవర్ స్టార్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ సిద్ధం చేసి కొన్నాళ్ల క్రితం ఆయనని పర్సనల్ గ కలిసి ఆ లైన్ వినిపించి ఆమోదం అందుకున్నారట. మంచి మాస్, కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ ప్రస్తుతం సిద్ధం చేస్తున్న బోయపాటి, త్వరలో పూర్తి అయిన వెంటనే దానిని పవన్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకోనున్నట్లు టాక్. కాగా ఈ సినిమాని ఒక బడా నిర్మాణ సంస్థ రూపొందించనుండగా ఈ మూవీ సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్ సెప్టెంబర్ 2న పవర్ స్టార్ జన్మదినం సందర్భంగా రానున్నట్లు చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా పవర్ స్టార్ తో మాస్ దర్శకుడు బోయపాటి కాంబోలో భారీ మూవీని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: