వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన `దిల్`, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `సై` చిత్రాలు నితిన్ కెరీర్ను టాప్ ప్లేస్కి తీసుకెళ్లడానికి ఎంతో ప్లస్ అయ్యాయి. ఇక పోతే గత కొన్నేళ్ల నుంచి ఈయన హీరోగా ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు సొంతంగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు.
ఇక భారీ అంచనాల నడుమ 11, నవంబర్ 2015న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. బలమైన పాయింటే తీసుకున్నా.. ఆసక్తి కలిగించని సన్నివేశాలతో, పేలవమైన కథనంతో సాగడం వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయింది. దీంతో బిగ్ హిట్ అవుతుందనుకున్న ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచి నిర్మాత నితిన్కు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా విడుదల తరవాత నితిన్ చేతులు గట్టిగానే కాలాయి.