ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఒకటే మాట వినిపిస్తోంది..సాయి పల్లవి.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు..ఒక్కో సినిమా తో ఒక్కో విధమైన క్రేజ్ ను అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్థానం లోకి వచ్చింది. సాయి పల్లవి ఉందంటే చాలు సినిమా ను చూడాల్సిందే అని సగటు సినీ ప్రేక్షకుడు అనుకునే స్థాయికి చేరుకుంది. సాయి పల్లవి కోసమే సినిమా ను చూసే అభిమానులున్నారు. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుంటే.. పక్కన ఏ స్టార్ హీరో ఉన్నా కూడా దిగదుడుపే అవుతాడు.


సాయి పల్లవి నటన ముందు ఎవ్వరైనా తేలిపోవాల్సిందే. అంతలా సాయి పల్లవి మ్యాజిక్ చేస్తుంది. అందుకే అందరూ ఆమె ఫిదా అవుతారు. ఆమె ఆఫ్ స్క్రీన్ బిహేవియర్, మాట్లాడే తీరు, కట్టూబొట్టూ ఇలా అన్నీ కూడా ఆమె పై గౌరవాన్ని పెంచేస్తుంటాయి. సాయి పల్లవి ఏ రోజు కూడా గ్లామర్ షో చేయలేదు. సౌందర్యం అంటే.. కనిపించేది కాదని నమ్ముతుంటుంది. సాయి పల్లవి. అలా సాయి పల్లవి మరోసారి విరాట పర్వం అనే సినిమా తో తెలుగు వారిని కట్టి పడేసేందుకు వచ్చింది. నేడు విడుదలైన విరాట పర్వం చిత్రం లో వెన్నెల పాత్ర పోషించి అందరి మనసులు గెలుచుకుంది..


మొన్నీమధ్య ఓ సందర్భం లో ఈ విషయం గురించి చెప్పకనే చెప్పింది.అల్లు అర్జున్ లాంటి డ్యాన్సర్‌ తో సాయి పల్లవి స్టెప్పులు వేస్తే ఇక థియేటర్‌ లో అల్లర్లు భీబత్సంగా ఉండవని అర్ధమవుతుంది. విల్లుగా వంగుతుంది. మెరుపులా తళుక్కుమంటుంది. నృత్యానికి చిరునామాలా ఉంటుంది. సహజత్వానికి పెద్ద పీట వేస్తుంది. నవ్వితే హృదయ పరిమళంలా ఉంటుంది. సాయి పల్లవి. డ్యాన్సు కి మరో పేరు. ‘ఫిదా’ సినిమా తరువాత- తనో ప్రత్యేక పీస్‌ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండి, పోయింది.. ఈ వార్త నిజమైతే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: