కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినా తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సిరి ప్రేమికులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు . తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదలైన బీస్ట్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది . ఇలా బీస్ట్ మూవీ తో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కు తున్న వరిసు (వారసుడు) అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . తమిళం లో ఈ సినిమా వరిసు అనే పేరుతో తెరకెక్కుతూ ఉండగా , తెలుగు లో ఈ మూవీ వారసుడు పేరుతో తెరకెక్కుతోంది .

మూవీ లో దళపతి విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినీ కార్మికుల బంద్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే, కానీ ఈ సినిమా తమిళ సినిమా అని దిల్ రాజు ప్రకటించడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం వారసుడు మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. మరో వారం రోజుల పాటు కూడా ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇలా వారసుడు మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: