తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ ఇమేజ్ కలిగిన హీరో లలో ఒకరు ఆయన గోపీ చంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీ చంద్ హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విలన్ గా కొన్ని సినిమాల్లో నటించి ప్రతి నాయకుడు పాత్రలతో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచు కున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మళ్లీ యజ్ఞం మూవీ లో హీరోగా నటించాడు. యజ్ఞం మూవీ తో హీరో గా మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న గోపీచంద్ , ఆ తర్వాత హీరోగా ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కొనసాగు తున్నాడు. ఇది ఇలా అంటే పోయిన సంవత్సరం సిటీ మార్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించగా , సంపత్ నందిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం గోపిచంద్ 'పక్కా కమర్షియల్' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. రాశి కన్నా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ,  మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ సినిమా తాజాగా స్టార్ మా చానల్లో ప్రసారం అయ్యింది. స్టార్ మా చానల్లో మొదటి సారి ప్రసారం అయినప్పుడు పక్కా కమర్షియల్ మూవీ 3.95 'టి ఆర్ పి' ని సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ కి మొదటి సారి ప్రసారం అయినప్పుడు మంచి 'టి ఆర్ పి' రేటింగ్ దక్కింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: